Ongoing bull competitions కొనసాగుతున్న ఎద్దుల పోటీలు

సిరా న్యూస్, ఒంగోలు;
ప్రకాశం జిల్లా దర్శి లో జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్ల పోటీలు మూడవరోజు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జి.వి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ఎడ్ల పోటీలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని, అంతరించి పోతున్న సాంస్కృతిక క్రీడలు కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు.
జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నమన్న ఆయన వైసీపీ పని అయిపోయిందని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ జనసేన కు ఎదురులేదని ఎద్దేవా చేశారు. వైసీపీప్రభుత్వం రైతులను మోసం చేసిందని రైతులకు సబ్సిడీ లోన్ ఇవ్వకుండా తుఫాన్ లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా దగా చేసిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. ఎమ్మెల్యే లను మార్చి తనగొయ్య తానే తొవ్వుకున్నారు. గిట్టుబాటు ధర కల్పించడం కోసం రైతులకు ఆదుకోవడానికి ప్రభుత్వం ఇవ్వవలసిన రైతు సంక్షేమ నిధికి 3000 కోట్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం వైసీపీ ప్రభుత్వంలో రైతులకు కనీసం టార్పాలిన్ పట్టాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *