సిరా న్యూస్,హైదరాబాద్;
సంస్కృతి భాష కేవలం సంభాషణ నిమిత్తమే కాకుండా మన రుషులు, మునులు రాసిన అనేక గ్రంథాల్లో ఉన్న అద్భుత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగించాలని స్వామి తత్త్వవిదానంద సర స్వతి శిష్యులు స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి సూచించారు. మారుతున్న కాలంతో పాటు సంస్కృత ప్రచారం కూడా మారాలనే ఉద్దేశంతో సంస్కృత భాషా శిక్షణ ఆన్లైన్ మాధ్యమంలో జరగాలని ఏకదంతా ప్రాజెక్టును రూపొందించా మని, ఏ మారుమూల ఉన్నా ఫోన్, కంప్యూటర్ ద్వారా ఈ సంస్కృత శిక్షణ తరగతులు వినవచ్చని తెలిపారు. ఏకదంతా మొదటి లెవల్ ఇంటర్నెట్ ప్రాజెక్టును జూబ్లీహిల్స్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ సంస్కృత కోర్సులు బ్రోచర్ను కూడా మాజీ డీజీపీ కరణం అరవిందరావు, ఎం ఎస్ రామారావు ట్రస్ట్ చైర్మన్ పి. శ్రీనివాసస్వామి, సంస్కృత భారతి చైర్మన్ లక్ష్మీనటాచార్య, వేద సంస్కృత సమితి వైస్ చైర్మన్ డాక్టర్ విశాలక్షి, సంభాషణం సంస్కృత వార్తా వాహిని చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, కుమరవేలు తదితరులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో వర్ణమాల నుంచి సంభాషణ వరకు అనేక వేది కల్లో సంస్కృత క్లాస్లు ఉంటాయన్నారు. ఈ ఏక దంతా ప్రాజెక్టు భగవద్గీత శిక్షకురాలు ఆచార్య సీహెచ్, సద్గుణ, ఫిల్మ్ డైరెక్టర్ ఎంవీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పనిచేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా భగవద్గీత లాంటి మోక్షకా స్త్రాన్ని యదార్థంగా అర్థం చేసుకుని నిజ జీవితంలో అనునయింపుచేసుకోవాలని సూచించారు. మాజీ డీజీపీ అరవిందరావు మాట్లాడుతూ సనా తన ధర్మాన్ని చిన్నప్పటి నుంచే ప్రతిఒక్కరికీ బోధించాలని, సంస్కృత భాష రావాలంటే ముందుగా తెలుగు వ్యాకరణం తెలపాలన్నారు.