-సభకు హాజరైన పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి
సిరా న్యూస్,మంథని;
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి., మంథని కార్యాలయంలో సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం రైతు బంధు పథకంపై ప్రత్యేక మహా సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, సహకార శాఖ సూపరింటెండెంట్ సువర్ణ, మానిటరింగ్ అధికారి ముఫాసిర్ అహ్మద్, ఏఓ శ్రీకాంత్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పంట కాలానికి గానూ రూ.7500 చొప్పున రైతులకు ఆర్థిక సహాయం చేయుటకు గానూ సహకార సంఘ సభ్యులు, రైతుల నుండి అభిప్రాయ సేకరణ వ్రాత పూర్వకంగా తీసుకున్నట్లు పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి తెలిపారు. ఐదెకరాలలోపు సీలింగ్ విధించి రైతు భరోసా ఇవ్వాలని కొంతమంది, 10 ఎకరాలలోపు ఇవ్వాలని మరికొంత మంది , గుట్టలు, ఎస్ఆర్ఎస్పి భూములకు ఇవ్వొద్దని ఇంకొంతమంది, గత ప్రభుత్వం ఇచ్చినట్లు ఇవ్వాలని, సాగు చేసిన భూ విస్తీర్ణానికే ఇవ్వాలని, 3ఎకరాలలోపు ఇవ్వాలని, ఐటి చెల్లించేవారికి, చిన్న రైతులకు ఇవ్వాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాశ్ రెడ్డి, డైరెక్టర్ ఆకుల రాజబాపు, కొత్త శ్రీనివాస్, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, ఏఈఓలు శివకుమార్, మధుకర్, సుధీర్, సంఘ సభ్యులు, రైతులు, సంఘ
సిబ్బంది పాల్గొన్నారు.