సిరాన్యూస్, బోథ్
ప్రైవేటు పాఠశాల దోపిడిని అరికట్టాలి : రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రెటరీ కొట్టూరి ప్రవీణ్ కుమార్
ప్రైవేటు పాఠశాల దోపిడిని అరికట్టాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు , రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రెటరీ కొట్టూరి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలో అవినీతి రాజ్యమేలుతుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. అలాగే యూనిఫార్మ్స్ బుక్స్ బోట్లు టైలు పాఠశాలలోనే దుకాణాలు తెరిచి బహిరంగంగానే అమ్ముతున్నారని తెలిపారు. వేలాది రూపాయలు తల్లిదండ్రుల నుండి పిండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ తతంగమంతా తెలిసినప్పటికీ కూడా ఉన్నత విద్యాధికారులు చూసి చూడనట్టు ఉంటున్నారన్నారు. వెంటనే ఉన్నత విద్యాధికారులు స్పందించి అన్ని ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని టీజీవిపి తరఫున డిమాండ్ చేశారు. సమావేశంలో ఆదిలాబాద్ పట్టణ, బోథ్ నియోజకవర్గ కన్వీనర్ గొర్ల నరేందర్ కో కన్వీనర్ సతీష్, సాయి, గణేష్, పవర్ అఖిల్, జాదవ్ కళ్యాణ్. చౌహన్ విశాల్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.