సిరాన్యూస్, చిగురుమామిడి
కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కు ఓటు వేయాలి : ఓరుగంటి భారతీదేవి
* సుందరగిరిలో గడపగడపకు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ఓరుగంటి భారతీదేవి అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎనగందుల లక్ష్మణ్, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ఓరుగంటి భారతీదేవి ల ఆధ్వర్యంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పత్తేo స్వరూప, ఆకుల మల్లికార్జున్, తైదల సుధాకర్, ఆవుల నారాయణ, గందే రాజయ్య, రవి, కక్కర్ల సంపత్, ఎనగందుల వెంకటయ్య, వంతడుపుల బిక్షపతి, యూత్ కాంగ్రెస్ నాయకులు బట్టు శ్రీనివాస్, జీల శ్రీకాంత్, ఎనగందుల ప్రశాంత్, కావేటి సంపత్, కొమ్ము సందీప్, వంతడుపుల రాజు తదితరులు పాల్గొన్నారు.