మా సమస్యలపై స్పందించిన నాయకులకే మా మద్దతు

స్పష్టం చేసిన తెలంగాణ వంజరి సేవా సంఘం
సిరా న్యూస్,హైదరాబాద్ ;
కొందరి కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, తమ కుల సమస్యలపై గలమెత్తిన పార్టీలకు నాయకులకు తమ మద్దతు ఇస్తామని తెలంగాణ వంజరి సేవా సంఘం ప్రకటించింది. ఈరోజు సికింద్రాబాద్ లో జరిగిన కార్యవర్గ సమావేశంలో, 75 సంవత్సరాలుగా పేదరికంలో కునారిల్లుతున్న వంజర్లకు ఎటువంటి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది దక్కలేదని, ఎస్టీలలో ఉన్న రిజర్వేషన్ తొలగించి బీసీ(డి ) జాబితాలో బలవంతంగా కలిపి వంజరుల పట్ల మరణ శాసనం లిఖించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయాన్ని సవరించడానికి, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకే దేశము- ఒకే ప్రజా- ఒకే చట్టం విధానాన్ని అవలంబిస్తామని ప్రకటించిందని అదే తరహాలో ఒకే కులం ఒకే రిజర్వేషన్ ఉండాలని మహారాష్ట్ర తరహా డిఎన్టి రిజర్వేషన్ వంజర్లకు దక్కాలని దేశవ్యాప్తంగా ఉన్న వంజరులకు ఒకే రిజర్వేషన్ విధానం అవలంబించాలని వారి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 17 బీసీ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లుగానే వంజరి కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గ్రామాల్లో నిరుపేద జీవనం సాగిస్తున్న వంజర్లను ఆదుకోవడానికి ప్రత్యేక పథకం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యల పట్ల స్పందించిన నాయకులకు మాత్రమే తమ మద్దతు ఉంటుందని, ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని వారు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత వంజరి సేవా సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సాల్వేరు కృష్ణ తెలంగాణ వంజరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎదుగని శంకర్ నారాయణ, ప్రధాన కార్యదర్శి దాత్రిక ధర్మరాజు, ఉపాధ్యక్షులు ఎదగని హరినాథ్, ఏమికే సూర్యనారాయణ,కార్యదర్శి దౌరే గంగరాజు, నాయకులు కాలేరు సురేష్, వంజరి టుడే ఎడిటర్ కాలేరు రూపా జ్యోతి ఎదగను సాయి, రత్న మల్లు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *