ముస్లిం మైనారిటీ మహిళలు
సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
రానున్న ఎన్నికల్లో తమ మద్దతు ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ జయనాగేశ్వర రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వారు ప్రకటించారు. ఎమ్మిగనూరు పట్టణంలోని మైనారిటీ కాలని మహిళలు ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి వి జయనాగేశ్వర రెడ్డి గారిని ఆయన స్వగృహంలో కలిసి తమ మద్దతు తెలిపారు. తమ మైనారిటీల గురించి ఎవరూ ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసిన కూడా ముస్లింలు అందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటామని ముక్తకంఠంతో తెలుపడం జరిగినది.
========