సిరా న్యూస్,రంపచోడవరం;
ఏజెన్సీ వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. దేవీపట్నం మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ అమ్మవారి ఆలయం గోదావరి పూర్తిగా మునిగింది. గోదావరి వరద ఉధృతి అధికంగా ఉండడంతో పాపికొండలు టూరిజం బోట్లను నిలిపివేసారు. రంపచోడవరం మండలం భూపతిపాలెం ప్రాజెక్టు నుండి ఐదు గేట్లను ఎత్తి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు ఇరిగేషన్ అధికారులు.
రంపచోడవరం మండలం పందిరి మామిడి బందపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జిపై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. రంపచోడవరం మండలం ముసురుమిల్లి ప్రాజెక్టుకు హెడ్ వర్క్ పూర్తి కాకపోవడంతో వరద నీరు వృధాగా పోతుంది. రాజవొమ్మంగి మండలంలో నెల్లిమెట్ల, లబ్బర్తి, ఒట్టిగడ్డ, ఎర్రంపాడు, లబ్బర్తి, అనంతగిరి గ్రామాల మధ్య రోడ్లపై వాగులు పొంగి పడడంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్ గ్రామ సమీపంలోని రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది.
మారేడుమిల్లి మండలం బొడ్లంక గ్రామసమీపంలో ఉన్న పెళ్లిరేవు కొండవాగు ఉదృతంగా ప్రవహించడంతో సుమారు 70 గ్రామాలు జలదిగ్భందం అయ్యాయి. సీతపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతోదేవీపట్నం మండలంలోని లక్ష్మీపురం, గుంపెనపల్లి గ్రామాలకు రాకపోకు నిలిచిపోయాయి.