పి.గన్నవరంలో మారుతున్న రాజకీయాలు

 సిరా న్యూస్,పి గన్నవరం;
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం లో రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. టీడీపీ ,జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే సరిపెళ్ళ రాజేష్ కు టిక్కెట్ ఇవ్వడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. టీడీపీ లో కొత్త అభ్యర్థులు తెరపైకి వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి టీడీపీ లోకి చేరతారు అంటూ ముమ్మర ప్రచారం నడుస్తోంది. సరిపెళ్ళ రాజేష్ కు టికెట్ ఇవ్వడం పై టీడీపీ ,జనసేన నేతలు మండిపడుతున్నారు. రాజేష్ కు సహకరించం అంటూ తెగేసి చెప్పారు. దీనితో పాముల రాజేశ్వరిదేవి, మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పులపర్తి నారాయణ మూర్తి తనయుడు తెరపైకి వచ్చారు. ఇండిపెండెంట్ గా బరిలో వుండేందుకు పులపర్తి రవి సిద్ధం అవుతున్నారు అంటూ ప్రచారం మొదలయింది. స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలంటూ,నేతలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోనే పి. గన్నవరం నియోజకవర్గ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *