సిరాన్యూస్,ఓదెల
విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలి
* పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి పద్మ
* ఘనంగా వీడ్కోల సమావేశం
విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి పద్మ అన్నారు. బుధవారం ఓదెల పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 2023 -24 పదవ తరగతి విద్యార్థులకు పాఠశాలలోని 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి పద్మ పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మంచి జిపిఏ సాధించాలని భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని క్రమశిక్షణ కలిగి ఉండాలని తెలియజేశారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్వో యాకన్న గారు హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు మంచి ప్రవర్తనను కలిగి ఉండాలని పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలను పొందాలని విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలియజేశారు . ఓదెల ఎంపీటీసీ శ్రీ చిన్న స్వామి మాట్లాడుతూ అన్ని వృత్తుల ఉపాధ్యాయ వృత్తి గొప్పదని తెలియజేశారు విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో ఉత్తీర్ణత పొందాలని అభిలాషించారు. మాజీ సర్పంచ్ శ్రీ ఆకుల మహేందర్, విద్యార్థులు పరీక్షలు భయము లేకుండా రాయాలని శుభాకాంక్షలు తెలియజేశారు . ఎస్ఎంసి చైర్మన్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎక్కువ మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించాలని ,100శాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు ఓదెల మండలంలో మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉపన్యాసాలు నృత్యాలు అలరించాయి ఈ వీడ్కోలు సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు అతిథులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.