సిరాన్యూస్, చిగురుమామిడి
దాసరి వైష్ణవ్యను సన్మానించిన పద్మశాలీ సంఘం నాయకులు
ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 10జిపి మార్కులు సాధించి చిగురుమామిడి మండల టాపర్ గా నిలిచిన దాసరి వైష్ణవ్య ను శుక్రవారం మండల పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా దాసరి వైష్ణవ్యకి శాలువా కప్పి అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ మోడల్ స్కూల్ లో చదివి మండల టాపర్ గా నిలవడం అభినందనీయమని అన్నారు. పద్మశాలి సమాజానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించిందన్నారు. కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు వంగర మల్లేశం, ప్రధాన కార్యదర్శి మంచి కట్ల కనకయ్య, మోర పద్మనాభం, డిష్ భాస్కర్, గొల్లబత్తిని రవీందర్, బైరి శ్రీనివాస్, చిమ్మన నాగరాజు, ఎన్నం వెంకటేశం,బల్లు శేఖర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.