కాంగ్రెస్ లో చేరిన పద్మశాలి నేతలు

సిరా న్యూస్,హుస్నాబాద్;
హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గాజుల భగవాన్ నేత ,పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొలి వెంకట నారాయణ , పాము రాజన్న మార్కండేయ స్వామి ఆలయ బాద్యులు, వేముల వెంకట రమణ జనగామ గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షులు , సాదుల యాదగిరి ,వేముల వీరాస్వామి ,గాదాసు రాజు ,వివిధ గ్రామాల పద్మశాలి సంఘం అధ్యక్షులు ,తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికిచ కాంగ్రెస్ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి మాట్లాడుతూ పార్టీలో చేరిన పద్మశాలి సంఘం నేతలకు సాదర స్వాగతం పలుకుతున్నాం. హుస్నాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి సమస్యలు పరిష్కరిస్తం. బలహీన వర్గాల శాఖ మంత్రి గా పద్మశాలి వర్గాల సమస్యలను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరిస్తం. హుస్నాబాద్ నియోజకవర్గంలో జౌళి శాఖ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఏ విధంగా ఈ వర్గాలకు న్యాయం చేయగలం అని మాట్లాడడం జరిగిందని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న పద్మశాలి నాయకులు అంత ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మాట్లాడుతున్నాం. ప్రభుత్వం పద్మశాలి వర్గానికి చేయూత కు తోడ్పడుతుంది. వారికి అండగా ఉంటామని హని ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *