అన్యమత పాలనపోయి గోవిందుడి పాలన వచ్చింది

సిరా న్యూస్,తిరుమల;
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం నాడు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తరువాత అయన మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేసారు.
ఏపీలో గత పాలకులు వీరప్పన్ వారసులు. నిలువు నామాలతో ప్రజలకు పంగ నామాలు పెట్టారు. ఎర్రచందనం దోపిడీతో సర్కార్ కే అప్పులిచ్చే స్థాయికి ఎదిగారు. శేషాచల కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతాం. నాస్తికులకు, అన్యమతస్థులకు పదవులిచ్చి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారు. నివేదిక ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామం. ఏడుకొండలను రెండు కొండలుగా మార్చాలనుకున్న అన్యమత పాలన పోయింది. అన్యమత పాలన పోయి గోవిందుడి పాలన వచ్చిందని అన్నారు.
================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *