Paidipally Srinivas: నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

సిరాన్యూస్‌, చిగురుమామిడి
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
* మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు,  నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలకు నష్టపరిహారాన్ని ఇచ్చి రైతులను ఆదుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం తహాసిల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శైలజ కి వినతిపత్రం అందజేశారు. మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రెండు లక్షలు రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 వేల రూపాయలు నష్టపరిహారం అందజేయాలన్నారు. కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు బిజెపి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు కంది శంకర్, పెండోట రఘు, కార్యదర్శి కోమటీరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బూత్ అధ్యక్షులు సాగర్ రెడ్డి, మామిడి రమేష్, కోయెడ శేఖర్, సోషల్ మీడియా కన్వీనర్ గుంటి సతీష్, నాయకులు గండ్రోత్ రామన్న, కోమటిరెడ్డి శివ ప్రసాద్ రెడ్డి, కొత్త రాజు, నూనె మధు, మునిగంటి వినయ్, మహంకాళి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *