సిరాన్యూస్, చిగురుమామిడి
ప్రత్యేక అధికారుల పాలనలో అభివృద్ధి శూన్యం: పైడిపల్లి శ్రీనివాస్
* పంచాయతీ సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవోకు వినతి
గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల అభివృద్ధి శూన్యం అని చిగురుమామిడి బీజేపీ మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ అన్నారు. గ్రామపంచాయతీ ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ఎంపీడీవోకు బీజేపీ మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో నాలుగు నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనాలో ఇలాంటి అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు.కార్యదర్శులకు గ్రామపంచాయతీ సిబ్బందికి జీతాలు రావడం లేదన్నారు. ప్రత్యేక అధికారుల పాలన గాడి తప్పిందన్నారు.గ్రామ పంచాయతీలకు రావలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చెప్యల మురళి మనోహర్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు కంది శంకర్, మాజీ మండల అధ్యక్షులు అచ్చ రవీందర్, బీజేవైఎం నియోజకవర్గ కన్వీనర్ జేరిపోతుల శ్రీనివాస్, ఓబీసీ మోర్చ మండల గర్డస్ సతీష్,జిల్లా కార్యవర్గ సభ్యులు ముంజ చంద్రయ్య, బూత్ అధ్యక్షులు శ్రీమంతుల వెంకటస్వామి, నిమ్మ రమాకాంత్ రెడ్డి, గుల్ల సంపత్, పత్తెం మొగిలి, కోయేడ శేఖర్, ఓబీసీ మండల కార్యదర్శి నడిగొట్టు కిరణ్, బీజేపీ నాయకులు పింగిలి రామ్ రెడ్డి, అభిలాష్, నట్ నరేందర్ రెడ్డి, గాండ్రోత్ రామన్న, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.