Paidipelli Srinivas: జెడ్పీటీసీ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

సిరాన్యూస్, చిగురుమామిడి
జెడ్పీటీసీ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల జెడ్పీటీసీ గీకురు రవీందర్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో బీజేపీ మండల నాయకులు ఫిర్యాదు చేశారు. ఈసంద‌ర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పైడిపెల్లీ శ్రీనివాస్,మాజీ మండల పార్టీ అధ్యక్షులు అచ్చ రవీందర్, బీజేపీ నాయకులు మాట్లాడారు. పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తుంటే ప్రజల్లో మంచి ఆదరణ వస్తుంటే చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు యాత్రను అడ్డుకోవడం సిగ్గూ చేటు అన్నారు. అంతే కాకుండా మంగ‌ళ‌వారం స్థానిక జెడ్పీటీసీ గీకురు రవీందర్ వారి స్థాయిని మరిచి మాట్లాడార‌ని, బండి సంజయ్ ను పార్లమెంటు సభ్యులు అని చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడమే స‌రికాద‌న్నారు. అసభ్యకరమైన పదాలు వాడుతూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు.ఇంకోసారి ఇలాంటివి మాట్లాడితే సహించేదిలేదని హెచ్చ‌రించారు. కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు కంది శంకర్, బుదర్థి మహేందర్,మండల కార్యదర్శి కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,దాసరి సాగర్ రెడ్డి, దుడ్డేల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *