సిరా న్యూస్, సైదాపూర్
అభయాంజనేయ స్వామి గోపురం పనులు ప్రారంభం: పాల్సానీ రామ్ రెడ్డి
సైదాపూర్ మండలం లస్మన్నపల్లి గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయ గోపురం నిర్మాణ కోసం సోమవారం పనులను ప్రారంభించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి దేవాలయ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాల్సానీ రామ్ రెడ్డి, కమిటీ అధ్యక్షులు దొనపాటి రామ్ రెడ్డి, కోశాధికారి రేగుల తిరుపతి, డైరెక్టర్లు రేగుల సురేష్ , జాల సంపత్ రెడ్డి, మారం నారాయణరెడ్డి, నాంపెల్లి భూపతి, గ్రామ పెద్దలు గుర్రాల రాజిరెడ్డి, కొంపెల్లి రాజిరెడ్డి, మేస్త్రీ లోవ రాజు, సతీష్ , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.