కుమారుడు కుమార్తెల మధ్య గొడవ
సిరా న్యూస్,మిర్యాలగూడ;
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందుల వారి గూడెం కి చెందిన వేం వెంకటరెడ్డి లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమారుడు గతంలోనే మృతి చెందారు. లక్ష్మమ్మ నేరేడుచర్ల లోని చిన్న కూతురు వద్ద ఉంటున్నారు. ఇటీవల లక్ష్మమ్మ ఇంట్లో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడ్డారు దీంతో ఆమెను మిర్యాలగూడలోనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఇంటికి పంపివ్వడంతో మృతి చెందారు. మిగిలిన కూతుళ్లు ఆస్తి పంపకాలు తేలే వరకు అంబులెన్స్ ను తరలించేది లేదని తేల్చి చెప్పారు. లక్ష్మమ్మ దగ్గర ఇరవై ఒక్క లక్షల ఉన్నాయి. ఆరు లక్షలు వైద్య ఖర్చుల నిమిత్తం చిన్న కూతురుకి ఇచ్చారు. మిగిలిన 15 లక్షలు కొడుకు తీసుకున్నారు. 20 తులాల బంగారంను ముగ్గురు కూతుళ్లు పంపకాలు జరిపారు. చివరికి ఆస్తి పంపకాలు కొలిక్కి వచ్చిన అంత్యక్రియల కొరకు డబ్బులు ఇస్తేనే తలకొరివి పెడతానంటూ పట్టుబడుతున్నారు. మృతదేహం ఇంకా ప్రెజర్ లోనే ఉంది.