సిరాన్యూస్, సైదాపూర్
నీరు నిల్వ కాకుండా తగిన చర్యలు చేపట్టాలి: పంచాయతీ కార్యదర్శి ఆర్ హరీష్
* వెన్నంపల్లి లో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమం
వర్షాల కారణంగా ఎక్కడ నీరు నిల్వ కాకుండా తగిన చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి ఆర్ హరీష్ అన్నారు. మంగళవారం సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని మంచినీటి బావి ట్యాంకులను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆర్ హరీష్ మాట్లాడుతూ తాగునీటి సరఫరాకు సంబంధించి నీటి నాణ్యత పరీక్షల ప్రజలే ముందే నిర్వహించి ప్రజల అనుమానాలను వారి ముందే నివృత్తి చేశామన్నారు.ఇళ్లలో తడి-పొడి చెత్తను వేరు వేరుగా ఉంచాలని, వర్షాల కారణంగా ఎక్కడ నీరు నిల్వ కాకుండా తగిన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, కారోబార్ రాజేందర్, అంగన్వాడీ టీచర్స్ మరియు ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామప్రజలు పాల్గొన్నారు.