సిరాన్యూస్, ఆదిలాబాద్
బోథ్ కోర్టులో ఏజీపీగా న్యాయవాది పంద్రం శంకర్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ కోర్టులో నూతనంగా ఏజీపీగా న్యాయవాది పంద్రం శంకర్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పంద్రం శంకర్ సన్మానించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ న్యాయం కోసం వచ్చిన ఖచ్చిదారులకు బాసటగా నిలిచి పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా మండలంలోని పలు గ్రామాల మాజీ ఎంపీటీసీలు, గిరిజన సంఘాల వారు సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యువజన అధ్యక్షులు బద్దం పోతారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్, అబ్రాస్ న్యాయవాదులు హరీష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు