సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న పరాశరన్

సిరా న్యూస్,తిరువనంతపురం;
గత 500 సంవత్సరాలుగా అయోధ్యలోని రామ జన్మస్థలంలో రామమందిరాన్ని పునర్నిర్మించడానికి వందలాది యుద్ధాలు జరిగాయి. వేలాది మంది ప్రజలు త్యాగం చేశారు. 80వ దశకంలో ఆలయ పునర్నిర్మాణం కోసం కరసేవకులు నిర్ణయాత్మక దశ పోరాటాన్ని చేపట్టినప్పుడు.. వందలాది మంది రామ భక్తులు పోలీసుల చేతుల్లో హతం అయ్యారు. 1992లో జరిగిన కరసేవ సమయంలో రామభక్తులు తీవ్ర ఆగ్రహంతో వివాదాస్పద భవనం నేలమట్టం చేశారు. తాత్కాలిక రామమందిరాన్ని నిర్మించారు. రామ మందిర నిర్మాణ పోరాటం చివరి అంకం కోర్టు మెట్లకు ఎక్కింది. ఇరు వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు జరిగిన చర్చలన్నీ విఫలమైన తర్వాత.. రోజువారీ విచారణ చేపట్టింది. ఈ సంక్లిష్ట సమస్యకు నిర్ణయాత్మక తీర్పుని సుప్రీంకోర్టు వెలువరించింది.శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతించినప్పుడు.. నాయర్ సేవా సొసైటీ తరపున సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా పరాశరన్ ధర్మాసనం ముందు వాదించారు. అయ్యప్ప స్వామి దేవాలయం పవిత్రతను కాపాడటానికి ఒక నిర్దిష్ట వయస్సు గల స్త్రీలను ప్రవేశించకుండా తప్పనిసరిగా నిషేధించవలసి ఉంటుందని పేర్కొన్నారు. 2008లో రామ జన్మభూమి ట్రస్ట్ పోరాటం పీక్ స్టేజ్ కు చేరుకుంది. 2008లో సుప్రీంకోర్టులో రామసేతును రక్షించిన ఘనత పొందిన 96 ఏళ్ల కేశవ పరాశరన్ (9 అక్టోబర్ 1927)ని రామ జన్మ భూమి ట్రస్ట్ బోర్డు ఆశ్రయించింది.ఆరు దశాబ్దాల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి 85 ఏళ్ల వయసులో వృత్తి నుంచి విరమణ తీసుకుని చెన్నైలో స్థిరపడ్డారు. వాల్మీకి రామాయణ శ్లోకాలను రోజూ పఠించే శ్రీ రామ భక్తుడైన పరాశరన్ రామ జన్మభూమి ట్రస్ట్ విజ్ఞప్తిని తిరస్కరించలేకపోయారు.పరాశరన్ తండ్రి, కేశవ్ అయ్యంగార్, న్యాయవాది. వేద పండితుడు. పరాశరన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కొన్ని రోజులు ఉద్యోగం చేసి మళ్లీ ఆ ఉద్యోగాన్ని వదిలేసి లా చదవాలని నిర్ణయం తీసుకున్నారు. లా డిగ్రీ కాలేజీలో చేరాడు. న్యాయశాస్త్ర డిగ్రీలో మూడు పతకాలు అందుకున్న తర్వాత తండ్రి సలహా మేరకు స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. పరాశరన్ బీజేపీకి లేదా సంఘ్ పరివార్‌కు చెందినవారు కాదు.కేశవ పరాశరన్ ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితులు.
1983 నుండి రాజీవ్ గాంధీ పాలన ముగిసే వరకు అటార్నీ జనరల్‌గా పనిచేశారు. 2003లో వాజ్‌పేయి నుంచి పద్మభూషణ్, 2011లో మన్మోహన్ సింగ్ నుంచి పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. యూపీఏ ప్రభుత్వం 2012లో ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది.తాను రాజకీయేతర వ్యక్తిని అని పరాశరన్ చెప్పారు “ఎప్పుడూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనలేదు. రాజకీయాలకు అతీతంగా ఉండాలనుకున్నట్లు చెప్పారు. అంతేకాదు తనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డ్స్ ను వాజ్‌పేయి , మన్మోహన్ సింగ్ లు ఇస్తారా అని ప్రశ్నిస్తారు కూడా.. మోడీ ప్రభుత్వ హయాంలో ఎన్‌జేఏసీ చట్టానికి రాజ్యసభలో గట్టి మద్దతు లభించింది. తన రాజ్యసభ పదవీకాలంలో పార్టీలకతీతంగా ఉంటూ తన స్టాండ్‌కు కట్టుబడి ఉన్నట్లు చెబుతారు కేశవ్ .రామజన్మభూమి కేసును సుప్రీంకోర్టులో 40 రోజుల పాటు విజయవంతంగా వాదించి ఐదు శతాబ్దాల పోరాటానికి ముగింపు పలికిన కేశవ్ పరాశరన్‌ను భారత చట్టాల పితామహుడు అని మద్రాసు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ అభివర్ణించారు. మతంతో రాజీపడకుండా న్యాయవాద వృత్తికి ఎంతో కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు.సుప్రీం కోర్టులో వాదిస్తున్న సమయంలో వేల సాక్ష్యాలను ఉదహరించాలి. ఇందు కోసం కేశవ పరాశరన్ కు డజనుకు పైగా లాయర్లు సహకరించారు. అతని బృందంలోని ప్రధాన ఆరుగురు న్యాయవాదులు యోగేశ్వరన్, అనిరుద్ధ శర్మ, శ్రీధర్ పొట్టరాజు, అదితి డాని, అశ్విని కుమార్ డి. ఎస్., భక్తి వరదన్ సింగ్.కోర్టులో రామమందిరం కేసును వాదిస్తున్నప్పుడు, చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ 93 ఏళ్ల పరాశరన్‌ను కూర్చోబెట్టి తన సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని వాదనలు వినిపించాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *