సిరాన్యూస్, సెట్టూరు
నేరాలను నియంత్రించేందుకే కార్డన్ సెర్చ్ : ఇన్చార్జి ఎస్సై పరశు రాముడు
నేరాలను నియంత్రించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు సెట్టూరు పీఎస్ ఇన్చార్జి ఎస్సై పరశు రాముడు తెలిపారు. గురువారం సెట్టూరు మండలంలోని చిన్నమపల్లి గ్రామం లో కళ్యాణదుర్గం పట్టణ సీఐ ,కుందుర్పి ఎస్సై , కళ్యాణదుర్గం సర్కిల్ సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం గ్రామంలో ప్రధాన రహదారులు, కాలనీలలో కవాతు చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లోకి అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా పోలీసుశాఖకు సహకరించాలని కోరారు.