సిరా న్యూస్,పరవాడ;
పరవాడ గ్రామంలో 17వ తేదీన జరగబోయే శ్రీరామనవమి పండుగ మహోత్సవం సందర్భంగా, శ్రీ సీతారాముల కళ్యాణం కోసం పందిరి రాట కార్యక్రమం పురోహితలు సమక్షంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర సీఈసీ సభ్యులు పైల శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్ చుక్క రాము నాయుడు దంపతులు, పరవాడ సర్పంచ్ సిరపరపు నాయుడు దంపతులు, పరవాడ ఉపసర్పంచ్ బండారు రామారావు, గ్రామ పెద్దలు పైల పోతునాయుడు,గండి ఈశ్వరరావు, పోతాల అప్పల నాయుడు, రెడ్డి శ్రీనివాసరావు, పైల అప్పారావు,వర్రీ హరి, బండారు శ్రీను తదితరులు పాల్గొన్నారు.