Parimilata Suresh: ప్రమాదం జరగకముందే జాగ్రత్తగా ఉండాలి

సిరాన్యూస్, నిర్మల్
ప్రమాదం జరగకముందే జాగ్రత్తగా ఉండాలి
వార్డ్ కౌన్సిలర్ పరిమిలత సురేష్
ప్రమాదం జరగకముందే జాగ్రత్తగా ఉండాలని వార్డ్ కౌన్సిలర్ పరిమిలత సురేష్ అన్నారు. శుక్ర‌వారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఐదవ వార్డులోనీ టవర్స్ కాలనీలో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రమాదకరంగా ఉన్నటువంటి కరెంటు స్తంభాన్ని తీపించి నూతన స్తంభాన్నివార్డు కౌన్సిలర్ పరిమి లత సురేష్ ఏర్పాటు చేయించారు. అనంత‌రం కిందికి ఉన్నటువంటి వైర్లను పైకి లాగిపించి ఎలాంటి ప్రమాదం లేకుండా దగ్గరుండి ప‌నులు చేయించారు. కార్య‌క్ర‌మంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ, లైన్మెన్ , జేఎల్ఎంలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *