సిరా న్యూస్, గుడిహత్నూర్:
పార్లమెంట్ ముట్టడికి తరలి వెళ్లిన యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు…
పార్లమెంట్ లో కాంగ్రెస్, విపక్ష సభ్యుల సస్పెన్షన్ ను నిరసిస్తూ బుధవారం ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ నిర్వహించిన పార్లమెంట్ ముట్టడిలో జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సంద్భంగా వారు పార్లమెంట్ వద్ద ఆందోళన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాయి చరణ్ గౌడ్, అసెంబ్లీ అధ్యక్షుడు ఆర్ఫాత్ ఖాన్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, బోథ్ అసెంబ్లీ అధ్యక్షుడు పోతా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.