సిరా న్యూస్,వికారాబాద్;
చేవెళ్లల ఎమ్మెల్యే కాలే యాదయ్య బిఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వికారాబాద్ జిల్లా నవపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీక్షకు దిగారు. గత పది ఏళ్లుగా అధికార బిఆర్ఎస్ పార్టీలో ఉండి.. బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఏంటని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని గత పది ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చిత్రహింసల గురి చేశారని.. అక్రమంగా కేసులు పెట్టించారని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అని మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిగ్గుండాలని తీవ్ర విమర్శలు చేశారు. కాలే యాదయ్య గో బ్యాక్ అంటూ వికారాబాద్ జిల్లా నవపేట్ మండల కేంద్రంలో నిరాహార దీక్షకు కూర్చున్నారు.
====