సిరా న్యూస్,పరవాడ;
అనకాపల్లి జిల్లా పరవాడ గ్రామంలో శ్రీశ్రీశ్రీ దుర్గమాంబ అమ్మవారి పండుగ మహోత్సవ సందర్భంగా పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీసులు , చల్లని చూపు ఈ ప్రాంత ప్రజల పై ఎల్లప్పుడూ ఉండాలని, సుభిక్షంగా ఆనందంగా ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో పరవాడ ఉప సర్పంచ్ బండారు రామారావు, గ్రామ పెద్దలు పైల పోతు నాయుడు, పైల గోపాల కృష్ణ, పైల హరీష్, వర్రీ హరి తదితరులు పాల్గొన్నారు.
=========================