సిరా న్యూస్,పార్వతీపురం;
పార్వతీపురం లో టీడీపీ వర్గపోరు రచ్చకెక్కింది. తాజాగా నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బోనేల విజయ చంద్ర పై ఫిర్యాదు చేయడానికి లోకేష్ శంఖారావం సభ వద్దకు అసమ్మతి నేతలు చేరుకున్నారు. విజయ్ చంద్ర సరిగా పని చేయడం లేదని, తన ఇష్టానుసారం గా వ్యవహరిస్తూ పార్టీకి చెడ్డ పేరు తీసుకు వస్తున్నరంటూ అసమ్మతి నేతలు మండిపడుతున్నారు. లోకేష్ ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో అసమ్మతి నేతలు వచ్చారు. లోకేష్ సభ నిమిత్తం కూడా తమకు ఆహ్వానం ఇవ్వలేదని మండిపడుతున్నారు.