సిరాన్యూస్,ఆదిలాబాద్
రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్న బీఆర్ఎస్: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి
* ఉనికి కోసమే బీఆర్ఎస్ నాయకుల ప్రయత్నం
10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రైతాంగం పూర్తిగా కుదేలైందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరేస్తే.. ఊరే..! అన్న కేసీఆర్ మాటలు విని మార్కెట్లో ధాన్య పురాషులపై రైతులు విగత జీవులుగా మారిన, రైతుల చేతులకు సంకెళ్లు వేసిన సంఘటన, పంటల కొనుగోలు చేయాలని రోడ్లెక్కిన రైతాంగం పై కేసులు పెట్టించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ, కెసిఆర్ ది అని విమర్శించారు. అధికారం పోయి ఐదు నెలలు గడవక ముందే ఉనికి కోల్పోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజా పాలన పై విమర్శలు చేస్తుందని, పంటల కొనుగోళ్ల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసిన, అకాల వర్షం వల్ల తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులెవ్వరు అధర్య పడద్దని , రైతు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. కొనుగోలు చేసిన పంటకు కూడా 15 రోజుల లోపల డబ్బులు చెల్లిస్తుందని తెలిపారు. రానున్న వర్షాకాల పంట సహాయం 15000 చేసి అందిస్తుందని, రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి త్వరలోనే రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు అందిస్తుందని తెలిపారు. అవాకుల.. చావాకులు పేల్చే బిఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మవద్దని రైతాంగానికి తెలియజేశారు.