సిరా న్యూస్, ఆదిలాబాద్:
అదిలాబాద్ లో విస్తృతంగా పర్యటించిన పటేల్ రమేష్ రెడ్డి…
– మండలాలవారీగా సీఎం సభ సన్నాహక సమావేశాలు
– సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని పిలుపు
సీఎం పర్యటన సన్నాహక సభ సమావేశ ఇన్చార్జ్ పటేల్ రమేష్ రెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గంలో గురువారం విస్తృతంగా పర్యటించారు. జైనథ్, బే, ఆదిలాబాద్ రూరల్ మండలం తో పాటు ఆదిలాబాద్ పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి సమావేశాలు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి 50 రోజులు గడిచిన తర్వాత మొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి వస్తున్న తరుణంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఏవైనా కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలని కోరారు. రానున్న పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నారు. అనంతరం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవ భవన్ ను ఆయన సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి తో కలిసి ప్రజా సేవా భవన్ లో తిరుగుతూ… అక్కడ చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి, గిమ్మ సంతోష్, అల్లూరి అశోక్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.