బంధువుల అందోళన
సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం ఆరోగ్య ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో శంకర్ నాయక్ అనే వ్యక్తి మృతి చెందాడు. కామేపల్లి, బర్లగూడెంకు చెందిన బాణోత్ శంకర్ నాయక్ జ్వరంతో రాత్రి ఆరోగ్య ఆసుపత్రిలో చేరాడు. డాక్టర్లు శంకర్ నాయక్ కు సరైన వైద్యం ఆదించకపోవడంతో మృతి చెండాడని బంధువులు ఆరోపించారు. రాత్రి నుంచి ఉదయం వరకు శంకర్ నాయక్ వైద్యం అందిస్తున్నామని మమ్మల్ని లోనికి వెళ్ళనియలేదని ఆరోపించారు. శంకర్ నాయక్ మృతదేహాన్ని చూడటానికి ఆసుపత్రిలోకి బంధువులను వెళ్లనివ్వనిలేదు. రోగి బంధువులు ఆసుపత్రిలోకి వెళితే తమను బయటకు ఈడ్చి వేశారనీ అవేదన వ్యక్తం చేసారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. ఆసుపత్రి ముందు పోలీసులు భారీగా మెహరించారు.