సిరా న్యూస్,గుంతకల్లు;
అనంతపురం జిల్లా, గుంతకల్లు పట్టణం లో ప్రాథమిక చికిత్స నిర్వహించిన ప్రైవేట్ హాస్పిటల్ ముందు మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా, గుంతకల్లు పట్టణంలో నివాసము ఉంటున్న అరవింద్ (24) పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ లో కిడ్నీ వ్యాధి కోసం ప్రాథమిక చికిత్స చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 7వ తేదీన ప్రాథమిక చికిత్సలు అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి బంధువులు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ అరవింద్ మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు గుంతకల్లు వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని ఆరోపిస్తూ,స్థానికులతో కలిసి స్థానిక ప్రైవేట్ క్లినిక్ వద్ద ఆందోళనకు దిగారు.