Patti Rajender Reddy: బ‌డీడు పిల్ల‌ల‌ను బ‌డికి పంపించాలి:  ప్రధానోపాధ్యాయులు పత్తి రాజేందర్ రెడ్డి

సిరాన్యూస్, భీమదేవరపల్లి
బ‌డీడు పిల్ల‌ల‌ను బ‌డికి పంపించాలి:  ప్రధానోపాధ్యాయులు పత్తి రాజేందర్ రెడ్డి

బ‌డీడు పిల్ల‌ల‌ను బ‌డికి పంపించాలని కొత్తపల్లి ప్రధానోపాధ్యాయులు పత్తి రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొత్తపల్లి ప్రధానోపాధ్యాయులు పత్తి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు బడీడు పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ బడికి పంపించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజప్రభ, పద్మ టి. విజయ భాస్కర్, రామచంద్ర మూర్తి, మాజీ ఎస్ఎంసి చైర్మన్ నడిగోటి నరేష్, విద్యార్థులకు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *