కళ్యాణదుర్గం నారాయణ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు సీజ్

సిరా న్యూస్,కళ్యాణదుర్గం;
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం పట్టణంలో స్ధానిక నారాయణ కార్పోరేట్ పాఠశాల లో పాఠ్య పుస్తకాలను ఎఐఎస్ఎఫ్,సిపిఎం నాయకులు సమాచారంతో మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమారి ఆద్వర్యంలో సీజ్ చేయించారు.. ఈ సందర్భంగా ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతరాయుడు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ నిభందనలకు విరుద్దంగా అడ్మిషన్లు చేపడుతూ పుస్తకాలను వేలాది రూపాయలుతో బలవంతంగా తల్లితండ్రులకు విక్రస్తున్నారు. దినిపై యాజమాన్యం పై మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్ కి పిర్యాదు చేసి సీజ్ చేయించడం జరిగింది. కార్పోరేట్,ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు,పుస్తకాలు పేరుతో విద్యను వ్యాపారం చేయడానికి చూస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *