పవన్ ఓటించకపోతే పేరు మార్చుకుంటా

ముద్రగడ
సిరా న్యూస్,కాకినాడ;
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు.పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేశారు. తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా నన్నారు. కాకినాడి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం పారిపోయి వచ్చారని పవన్ పై సెటైర్లు వేశారు. రాష్ట్రం చంద్రబాబు జాగీరు కాదన్నారు. పవన్ కల్యాణ్ కు విషయంపై అవగాహన లేకుండా బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. తుని రైలు దహనం ఘటనకు చంద్రబాబే కారణమన్నారు. ఈ విషయం పవన్ కల్యాణ్ తెలుసుకోవాలన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *