సిరాన్యూస్, ఆదిలాబాద్
హనుమంతుని ఆరాధిస్తే ధైర్యం పెరుగుతుంది
* ఆదిలాబాద్ ఎంఎల్ ఏ పాయల్ శంకర్
* ఘనంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టపన
* ప్రత్యేక పూజలు చేసిన ఎంఎల్ ఏ
యువకులు హనుమంతుని ఆరాధిస్తే వారికి ధైర్యం మనోబలం పెరుగుతుందని, వారు జీవితంలో ఎంతటి కష్టాన్నయినా సునాయాసంగా ఎదుర్కోగలిగే శక్తిని పొందుతారని ఆదిలాబాద్ ఎంఎల్ ఏ పాయల శంకర్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పాయల్ శంకర్ లయంలో నిర్వహించిన సంప్రోక్షణ, యజ్ఞం కార్యక్రమాలలో కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావన మనందరికీ ధైర్యాన్ని శక్తిని ఇస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు కాలనీవాసులు పాల్గొన్నారు.