Payal Shankar: కేంద్ర ప్రభుత్వ పథకాల‌పై విస్తృతంగా ప్రచారం చేయాలి

సిరాన్యూస్‌, జైన‌థ్‌
కేంద్ర ప్రభుత్వ పథకాల‌పై విస్తృతంగా ప్రచారం చేయాలి
* ప్రతి కార్యకర్త అకుంఠిత దీక్షతో పనిచేయాలి
* ఎమ్మెల్యే పాయల్ శంకర్

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జైనథ్ మండలం నీరాల గ్రామంలో ఏర్పాటు చేసిన బీజేపీ మండల కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గెడం నగేష్ హాజరయ్యారు. అనంత‌రం కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈసంద‌ర్భంగా గెడం నగేష్ మాట్లాడుతూ నిజాయితీగా అంకిత భావంతో పనిచేసే ఏకైక కార్యకర్త బీజేపీ కార్యకర్త అని కొనియాడారు.తమలో ప్రధాని అభ్యర్థి ఎవరో కూడ చెప్పుకోలేని పరిస్థితిలో ఇండియా కూటమి ఉంటే దేశంలో పసిపిల్లల నుండి కురవృద్ధుల వరకు ప్రధానమంత్రి ఎవరు కావాలని అడిగితే నరేంద్రమోదే కావాలని బల్లగుద్ది మరీ చెబుతున్నారని అన్నారు. గుడిసెలో ఉన్న రాముడికి గుడి కట్టిన మోదినే మళ్లీ దేశ ప్రధానిగా దేశం కోరుకుంటుందని, రాష్ట్రంలో మొత్తం 17 కు 17 స్థానాలు బీజేపీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా పాలనను పక్కనపెట్టి ఇతర పార్టీ నాయకులను పార్టీలో చేర్చుకోవడమే కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ కార్యకర్తలే ఊపిరిగా నడుస్తున్న పార్టీ అని తాము ఎమ్మెల్యే, ఎంపీగా గెలవడమే కాకుండా ప్రతి కార్యకర్తను ఆయా పదవుల్లో గెలిపించుకుంటేనే నిజమైన సంతోషమని, అందుకు గాను చివరి ఎన్నికల వరకు ప్రతి కార్యకర్త అకుంఠిత దీక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అశోక్ ముస్తాపురే పార్లమెంట్ కో కన్వీనర్ మయూర్ చంద్ర, బీజేపీ నాయకురాలు జ్యోతి రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు రాందస్‌, ర‌మేశ్, కరుణాకర్ రెడ్డి . చంద్రకాంత్. బింగి దయాకర్ , వివిధ పదాధికారులు,ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *