Payal Shankar: గెలుపే ల‌క్ష్యంగా ప‌ని చేయాలి

సిరాన్యూస్‌, బేల‌
గెలుపే ల‌క్ష్యంగా ప‌ని చేయాలి
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
* బీఆర్ ఎస్ మాజీ సర్పంచులు బీజేపీలో చేరిక

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ప్ర‌తి కార్య‌క‌ర్త ప‌ని చేయాల‌ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలో ఏర్పాటు చేసిన బీజేపీ మండల కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గెడం నగేష్ హాజరయ్యారు. కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే ఆధ్వ‌ర్యంలో బేలా మండలంలోని మనియర్పుర్ మాజీ సర్పంచ్ తేజ్రావ్ వడ్కర్, బేల‌ మాజీ సర్పంచ్ ఇంద్ర శేఖర్, పలువురు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈసంద‌ర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిజాయితీగా అంకిత భావంతో ప్రతి బీజేపీ కార్యకర్త పనీ చేయాలని అన్నారు.గోడం నగేష్ ను ఎంపీ గా గెలిపించే ల‌క్ష్యంగా పని చేయాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 17 కు 17 స్థానాలు బీజేపీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ కార్యకర్తలే ఊపిరిగా నడుస్తున్న పార్టీ అని తాము ఎమ్మెల్యే, ఎంపీగా గెలవడమే కాకుండా ప్రతి కార్యకర్తను ఆయా పదవుల్లో గెలిపించుకుంటేనే నిజమైన సంతోషమని, అందుకు గాను చివరి ఎన్నికల వరకు ప్రతి కార్యకర్త అకుంఠిత దీక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వివిధ పదాధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *