సిరాన్యూస్, బేల
ప్రజల పక్షాన ఉండే పార్టీ బీజేపీ : ఎమ్మెల్యే పాయల్ శంకర్
భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉండే పార్టీ అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడీ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రచారం నిర్వహించారు . ఈసందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ గ్రామంలో తిరిగి సమస్యలను అడిగి తెలుసుకుని పార్టీ కరపత్రాలు, స్టిక్కర్లు ఓటర్స్ లను పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉండే పార్టీ అని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారానే భారత దేశ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని అధిక మెజారిటీలతో గెలిపించాలని ఆయన కోరారు.కార్యక్రమం లో భాజపా మండల అధ్యక్షుడు నిక్కం దత్తా, సందీప్ టాక్రే , రాము, కార్యకర్తలు నాయకులు భూపత్ రెడ్డి , నందూగౌడ్, ప్రవీన్, సుభాష్ మహాజన్, తదితరులు పాల్గొన్నారు.