సిరాన్యూస్, ఆదిలాబాద్
గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం: ఎమ్మెల్యే పాయల్ శంకర్
గెడం నగేష్ను భారీ మెజార్టీతో గెలిపించండి
గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ మండలంలోని జందాపూర్, పొచ్చెర గ్రామాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి, గ్రామాల అభివృద్ధికి బీజేపీ ఎంతో కృషి చేసిందని అన్నారు. గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు, గ్రామీణ ప్రజల జీవన విధానంలో విస్తృత మార్పులకు బీజేపీ కారణమన్నారు. డిజిటల్ భారత్ లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ పట్టణాలకు అనుసంధానం చేసిందన్నారు. ఉపాధి హామీ పథకం, రైతు వేదికలు, మోక్షదామాలు కేంద్రం లోని నరేంద్రమోడీ ఆలోచలనలతో జరిగాయన్నారు. మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం కోసం ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన తోనే సాధ్యమయ్యిందన్నారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గెడం నగేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.