సిరాన్యూస్, ఆదిలాబాద్
కుటుంబ సమేతంగా ఓటేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన 281 పోలింగ్ బూత్ లో సోమవారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉదయం పూటనే ప్రజలు ఓటేయడానికి పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరడాన్ని మొదటిసారి చూస్తున్నానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియను చూస్తుంటే మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ అవడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.