Payal Shankar: కుటుంబ స‌మేతంగా ఓటేసిన ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్‌

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
కుటుంబ స‌మేతంగా ఓటేసిన ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్‌

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన 281 పోలింగ్ బూత్ లో సోమ‌వారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్ కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉదయం పూటనే ప్రజలు ఓటేయడానికి పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరడాన్ని మొదటిసారి చూస్తున్నానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియను చూస్తుంటే మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ అవడం ఖాయమని దీమా వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *