Payal Shankar: వైష్ణోదేవి ఆలయం దర్శించుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

సిరాన్యూస్‌, ఆదిలాబాద్
వైష్ణోదేవి ఆలయం దర్శించుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బుధవారం కుటుంబ సమేతంగా జమ్మూ కాశ్మీర్లోని వైష్ణవి ఆలయంలో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కుటుంబ సమేతంగా వైష్ణవి మాత ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పాయల్ శంకర్ వెంట సతీమణి ఉమా, కూతురు ,అల్లుడు, మనుమడు,మనవరాలు ఉన్నారు . అనంతరం శ్రీనగర్ లోని చారిత్రక లాల్ చౌక్ ప్రాంతాన్ని సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు పకడ్బందీ చర్యల వల్ల లాల్ చౌక్ ప్రాంతాల్లో స్వేచ్ఛపూరిత వాతావరణం నెలకొందని, ప్రజలు ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *