సిరాన్యూస్, ఆదిలాబాద్
ఖరీఫ్కు ముందే అన్నదాతలకు కష్టాలు: ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఖరీఫ్ సీజన్ సన్నద్ధం కంటే ముందే అన్నదాతలకు విత్తనాల నుండి కష్టాలు మొదలైనట్టు పరిస్థితి ఉన్నదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలో విత్తనాల షాపు వద్ద అన్నదాతలతో ఆయన మాట్లాడారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారితో మాట్లాడి వివరాలను సేకరించారు. వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే అన్ని శాఖల సమన్వయంతో రాష్ట్రంలో ఏ విత్తనాలకు డిమాండ్ అయితే ఉందో వాటి కొరత లేకుండా చూడాలని ముందుగానే సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పార్టీలకతీతంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు. బీజేపీ నాయకులు కిసాన్ మోర్చా తదితరులు ఉన్నారు.