సిరాన్యూస్,ఆదిలాబాద్
రేవంత్రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
హైదరాబాద్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను బుధవారం మర్యాదపూర్వకంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిశారు.ఈ సందర్భంగా ఆదిలాబాదులో పెండింగ్లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి , చనాక కోరాట ప్రాజెక్ట్ భూసేకరణ నిధుల విడుదల గురించి, ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా (డీపీఆర్ ) ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రి ని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిర్పూర్ కాగజ్ననగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు , బీజేపీ నాయకులు అశోక్ ముస్తపూరే, సంగప్ప పాల్గొన్నారు.