Payal Shankar: ఉన్నత స్థాయికి ఎదగాలి:  ఎమ్మెల్యే పాయల్ శంకర్

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
ఉన్నత స్థాయికి ఎదగాలి:  ఎమ్మెల్యే పాయల్ శంకర్
*  బీసీ వసతి గృహాన్ని సంద‌ర్శ‌న‌
* విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ వసతి గృహాల్లో తల్లిదండ్రులు చేర్పిస్తున్నారని, వారి ఆశలను వమ్ము చేయకుండా ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. చిన్నప్పుడు తాను హాస్టల్లో విద్యార్థుల కష్టాలు స్వయంగా చూశానని, ఇప్పుడు పరిస్థితులు మారినందున వసతి గృహాల వైపు దృష్టి సారిస్తున్నారని అన్నారు. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లోని బీసీ బాలుర వసతి గృహాన్నిఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈసంద‌ర్బంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని ప్రశ్నించారు. నోట్ బుక్కులు, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో భోజనం, ఇతర వస్తువులు సక్రమంగానే ఉన్నాయని ఎలాంటి సమస్యలు లేవని విద్యార్థులు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే సహపంక్తి భోజనం గావించారు. హాస్టల్ గదులు, వంటగది ఎమ్మెల్యే పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం పిల్లలకు నోటుబుక్కులు, ప్లేట్లు , దుప్పట్లు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ సంక్షేమ అధికారి మైసర్ల శివకుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల ప్రవీణ్, కేశవ్ , రాజు షిండే తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *