సిరాన్యూస్, జైనథ్
నేషనల్ హైవే అధికారులను కలిసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
హైదరాబాద్ లో నేషనల్ హైవే అధికారులను మంగళవారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిశారు. ఆదిలాబాద్ జిల్లా
జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయిందని, దాని స్థానంలో ఐరన్ బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు.జైనథ్, బేల మండల ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఐరన్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరారు. ఐరన్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే నూతన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి వరకు రాకపోకలు కొనసాగుతాయని పేర్కొన్నారు. రెండు మండలాలతోపాటు మహారాష్ట్రకు అనుసంధానంగా ఉన్న ఈ రహదారి ఉందని తెలిపారు. ఈ విషయాలకు సానుకూలంగా స్పందించిన నేషనల్ హైవే ఆర్ఓ అధికారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట భారతీయ జనతా పార్టీ నాయకులు ముస్తాపుర్, అశోక్ ఉన్నారు.