Payala Shankar: గోడం న‌గేష్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్

సిరాన్యూస్‌, జైన‌థ్‌
గోడం న‌గేష్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్

పార్లమెంట్ అభ్యర్థి గోడం నగేష్‌ను గెలిపించి మోడీకి బహుమతిగా ఇవ్వాలని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో ఎంపీ అభ్యర్థి నగేష్ కు మద్దతుగా ఎమ్మెల్యే పాయల్‌ శంకర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ.. బిజేపీ పార్టీ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అంతకుముందు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణ మాఫీని చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు రాందాస్, బోయర్ విజయ్, రమేష్, అశోక్ రెడ్డి, ముకుందరావు సన్నీ, మోహన్, రాజు, రమేష్, వెంకన్న, పోతరాజు, రమేష్, జోగు రవి, మహేందర్, నరేష్, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *