సిరా న్యూస్,ఆదిలాబాద్
ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగు నీరు
* ఎంఎల్ఏ పాయల్ శంకర్
* టాక్సీ డ్రైవర్లకు భీమా పత్రాలు అందజేత
వేసవికాలంలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగు నీరు అందించాలన్న ఉదేశ్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రం ఎంతో ఉపయోగకరం ఉంటుందని ఎంఎల్ఏ పాయల్ శంకర్ అన్నారు. అదిలాబాద్ పట్టణంలోని సిద్ధి వినాయక టాక్సీ డ్రైవర్స్ , ఓనర్స్ అసోసియేషన్ వారి చాలివేంద్రాన్ని ఎంఎల్ఏ పాయల్ శంకర్ ప్రారంభించారు. ఈసందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ గతంలో వారిచ్చిన మాట ప్రకారం అసోసియేషన్ సభ్యులకు తన స్వంత ఖర్చుతో 10 లక్షల భీమా చేయించి వారికి భీమా పత్రాలను అందించామని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.