payala Shenkar: ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి: ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్‌

సిరాన్యూస్‌, జైన‌థ్‌
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి: ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్‌
* సంగ్విలో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన
* ఎమ్మెల్యేను స‌న్మానించిన గ్రామ‌స్తులు

గ్రామ దేవత పోచమ్మ తల్లిని పూజించిన తర్వాతనే మిగతా కార్యక్రమాలను చేపట్టడం తెలంగాణలో రాష్ట్రంలో సంస్కృతి ఉందని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని సంగ్వి గ్రామంలో శుక్రవారం పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.. కార్యక్రమంలో బిజెపి నాయకులు మయూర్ చంద్ర అశోక్ రెడ్డి, భూమన్న సురేష్ తరుణ్ వైభవ్ సురేష్ అశోక్ తదితులున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *