సిరా న్యూస్,కుప్పం;
చిత్తూరు జిల్లా,కుప్పంలో పింఛన్ల కోసం వృద్ధులు,వికలాంగులు పడిగాపులు కాస్తున్నారు. వాలంటీర్లను పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని పెన్షన్ ధారులు అడగడంతో, సచివాలయాల వద్దకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని వాలంటీర్లు చెప్పారని వృద్ధులు వాపోయారు. 3వ తేదీ అయినా పెన్షన్ రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాల వద్ద పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు.